భారీగా దరఖాస్తులు…. సర్కార్ కీలక నిర్ణయం
2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. అయితే అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకు సాగలేదు.