కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. మిర్చి రైతులను కలిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా..? అని ప్రశ్నించారు. తాను రైతుల పక్షపాతిని అని… మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదని స్పష్టం చేశారు. సంక్షోభం నుంచి మిర్చి రైతులు బయటపడేలా చూడాలని డిమాండ్ చేశారు.