చివరి నిమిషంలో చదవడం
పరీక్ష సమయంలో చాలా మంది పిల్లలు చేసే పొరబాటు ఇది. పరీక్షకు ఒక రోజు ముందు, ఒక గంట ముందు వరకూ కూడా ప్రతిదీ చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల మెదడు గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల, వారు పరీక్ష రాసేటప్పుడు సిద్ధం చేసుకున్న విషయం ఏమీ గుర్తుండదు. అందువల్ల, చదువుకున్న తర్వాత చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ప్రతి పాఠాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.