విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, వీధి వ్యాపారులు, వ్యాపారవేత్తలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది డిజిటల్ చెల్లింపులను సులభతరంగా చేయనుంది. చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక అడుగు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. పేటీఎం టెక్నాలజీ ఆధారిత సేవలకు కట్టుబడి ఉందని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.