Farmers Protest: కరీంనగర్ మిల్క్ డెయిరీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన పాల శీతలికరణ కేంద్రం సీజ్ వివాదాస్పదంగా మారింది. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కు ఇండస్ట్రియల్ అనుమతి, ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు సీజ్ చేయడంతో పాల సేకరణ బంద్ అయి పాడి రైతులు రోడ్డెక్కారు.