సవాల్ విసురుతున్నా..
‘తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్లో.. ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. భవిష్యత్లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే.. తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం’ అని రేవంత్ స్పష్టం చేశారు.