అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. కాగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మృతుడు గడ్డం చైతన్య అన్న అయిన గడ్డం సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని కేయూ పోలీసులు వివరించారు. ఇదిలా ఉంటే వరంగల్ రింగ్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతుండగా అప్రోచ్ రోడ్లు, జంక్షన్లు ఉన్న చోట రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రయాణ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here