విక్టరీ వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అపజయం అనేది ఎరుగని అనిల్‌ రావిపూడిపై నిర్మాత  దిల్‌రాజుకు ఎంతో నమ్మకం ఉంది. అందుకే సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌తోపాటు ఈ చిత్రాన్ని కూడా విడుదల చేశారు. రిలీజ్‌ మొదటి రోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్లు కలెక్ట్‌ చేసి లోకల్‌ సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా సినిమా రిలీజ్‌ అయిన నెలరోజుల్లో ఏ సినిమా అయినా దర్శనమిస్తుంది. కానీ, ఈ సినిమాకి సంబంధించి నిన్నటి వరకు ఓటీటీ అప్‌డేట్‌ లేదు. 

ఈ సినిమా ప్రీమియర్‌ మార్చి 1న జీ తెలుగులో టెలికాస్ట్‌ అవుతుంది అనే వార్త ముందు వచ్చింది. మరి ఓటీటీ సంగతి ఏమిటి అనుకుంటున్న తరుణంలోనే టీవీలో, ఓటీటీలో ఒకేసారి ఈ సినిమా రాబోతోందని ప్రకటించారు. మార్చి 1 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్‌ ఈ సినిమా ప్రసారం కానుండగా, అదే టైమ్‌కి జీ5 ఓటీటీ యాప్‌లో ఇండియాలోని కొన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇలా ఒకేసారి టీవీలో, ఓటీటీలో ప్రసారమవుతున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఓటిటి డేట్‌ అనేది రాలేదు కానీ దీని కంటే ముందే టీవీ ప్రసారం డేట్‌ వచ్చేసింది.

మరి ఈ సినిమా హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా ఆల్రెడీ అఫీషియల్‌ టెలికాస్ట్‌ డేట్‌ మార్చ్‌ 1 వచ్చేసింది. అయితే అదే రోజు స్ట్రీమింగ్‌ కూడా ఉంటుంది అని స్ట్రాంగ్‌ బజ్‌ రాగ ఇపుడు ఫైనల్‌ గా అదే అఫీషియల్‌ అయ్యింది. టీవిలో టెలికాస్ట్‌ సమయం సాయంత్రం 6 గంటల నుంచే జీ5 లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పాన్‌ ఇండియా భాషల్లో రిలీజ్‌ కి తెస్తున్నట్టు ఇపుడు కన్ఫర్మ్‌ అయ్యింది. ఇక ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్‌ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here