సొరంగంలోకి జూపల్లి..
ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు లోపలికి వెళ్లాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్లారు.