మూడు నెలల కిందట..
గతేడాది నవంబర్ 16వ తేదీన ఫైబర్నెట్ ఛైర్మన్గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ కనెక్షన్లను.. వచ్చే రెండేళ్లలో 50 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్నెట్ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని.. ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలను మంచి నాణ్యతతో అందిస్తామని చెప్పారు. కానీ.. మూడు నెలలకు ఆయన రాజీమానా చేయడం చర్చనీయాంశంగా మారింది.