గతేడాది అక్టోబర్లో మొదలైన స్టాక్ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రేడింగ్ సెషన్ మొదలవుతుందంటేనే మదుపర్లు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వీటి మధ్య సోమవారం ట్రేడింగ్ సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 10:45 సమయానికి సెన్సెక్స్ 731 పాయింట్లు పడి 74,580 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50 225 పాయింట్లు కోల్పోయి 22,571 వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్ల పతనానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాము..