సందీప్‌ కిషన్‌ హీరోగా రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మజాకా’. రావు రమేష్‌, మురళీశర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తిరమైన అంశం బయటికి వచ్చింది. ఇందులో సందీప్‌ కిషన్‌, రీతు వర్మలపై ‘సొమ్మసిల్లి పోతున్ననే..’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్‌లో చాలా ఫేమస్‌ అయిపోయింది. ఇప్పటికే 280 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించిన ఈ పాటను ‘మజాకా’ చిత్రం కోసం ఉపయోగించడం ఆసక్తిని రేకెత్తించింది. ఒరిజినల్‌గా ఈ పాటను రాము రాథోడ్‌ పాడాడు. ఈ పాటతోనే మీడియాలో, సోషల్‌ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘మజాకా’ చిత్రంలో ఆ పాటను రేవంత్‌తో పాడిరచారు. 

ఈ పాట రిలీజ్‌ అయిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి. రాము పాడిన విధానం ఎంతో బాగుందని, సినిమా కోసం పాడిన రేవంత్‌ ఆ ఫీల్‌ను తీసుకురాలేకపోయాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఆ పాటను ఒరిజినల్‌ సింగర్‌ రాముతో పాడిస్తే బాగుంటుందని సోషల్‌ మీడియాలో సలహా ఇచ్చారు. దాన్ని పాజిటివ్‌గా తీసుకున్న మేకర్స్‌ రిలీజ్‌కి ఇంకా ఒక్కరోజు ఉందనగా ‘సొమ్మసిల్లి పోతున్ననే..’ పాటను రాము రాథోడ్‌తో పాడిరచారు. థియేటర్‌లో కూడా రాము పాడిన ట్రాకే ఉంటుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో ఆ పాటను ఎంతో ఇష్టపడే శ్రోతలు, ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here