నీరో చక్రవర్తిలా..
‘సీఎం రేవంత్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్పై కోపంతో కాంగ్రెస్ కరవు తీసుకొచ్చింది. రేవంత్కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ని ఖతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.