బాల్కనీ నుంచి పడిపోయి..
అయితే, తెలంగాణాకు చెందిన ఆ విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఐఐటీ పాట్నా రిజిస్ట్రార్ సంజయ్ కుమార్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బిటెక్ 3వ సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి హాస్టల్ గది బాల్కనీ నుండి పడిపోయాడని, సమీప ఆసుపత్రికి తీసుకువెళ్ళారని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, చనిపోయిన విద్యార్థి వివరాలను వెల్లడించలేదు.