పీసీబీపై విమర్శలు
29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఓ వైపు సొంత జట్టు టోర్నీ నుంచి త్వరగానే నిష్క్రమించనుంది. ఇంకో వైపు నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వర్షంతో మ్యాచ్ రద్దవడం పీసీబీని మరింత చిక్కుల్లో పడేసింది. స్టేడియం మొత్తం కవర్లతో నింపకుండా ఎందుకు వదిలేశారు? ఐసీసీ డబ్బులు ఏం చేశారు? అనే విమర్శలు వస్తున్నాయి.