ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… కీలక ప్రకటన చేశారు. మరో రెండురోజుల్లో కార్మికుల ఆచూకీ తెలుసుకుంటామని చెప్పారు. వారంతా బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామని తెలిపారు.