Vemulawada Rajanna: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివన్నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.