భోజనంలో చారు లేదా రసం ఉండాల్సిందే. ఎన్ని కూరలు ఉన్నా, వేపుళ్లు ఉన్నా కూడా చారు లేకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. తమిళనాడులో ప్రత్యేకమైన చారును చేస్తారు. అదే నిమ్మకాయ చారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చింతపండు వాడాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్లీ చేసుకుని తింటారు. దీన్ని చేయడం చాలా సులభం. నిమ్మకాయ చారు రెసిపీ ఇదిగో.