సీఐడీ కేసు..
అటు పోసానిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదుచేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్మీట్లో పోసాని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా, వ్యవస్థీకృతంగా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన ఫొటోలను ప్రదర్శించారని, ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీ కృష్ణ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబరులో కేసు నమోదు చేశారు.