ఇవీ లెక్కలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 63,34,732 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు ఉన్నారు. వీరులో మొత్తం 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్లను పొందుతున్నారు. వీరిలో దివ్యాంగ పెన్షనర్లు 7,87,976 మంది కాగా.. దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు 30,924 మంది ఉన్నారు. మిగిలిన 55,15,832 మంది వృద్ధాప్య, వితంతు పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్ అందజేస్తున్నారు.