తెలుగులో మంచి కంటెంట్‌తో వచ్చిన డివోషనల్‌ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ వుంది. తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’.  పవర్‌ఫుల్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ కథానాయకుడు. అవికాగోర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్‌ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్‌ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్‌ సమర్పణలో  తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ‘’ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. విజువల్‌ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది.  కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్‌ ఈ చిత్రానికి స్టనింగ్‌ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.  విజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్‌ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందిలి అన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here