మల్టీప్లెక్స్ యాజమాన్యాల మధ్యంతర పిటిషన్
అయితే జనవరి 21న ఇచ్చిన తీర్పుపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశాయి. పిల్లల ప్రవేశంపై ఆంక్షల విధించడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన అంక్షలను ఎత్తివేయాలని మధ్యంతర పిటిషన్ లో కోరింది. ఈ వాదానలతో ఏకీభవించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవచ్చని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.