కొత్త నమూనాలో రేషన్ కార్డులు
ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో…కొత్త రేషన్ కార్డులు పొందేందుకు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.