దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సోమవారం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షం కారణంగా ముంబైలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరింది. రైలు పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పాల్ఘర్‌లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్థులు రక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here