పన్నుల వ్యవస్థపై ట్రోల్స్కు గురైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు స్పందించారు. పన్నును సున్నాకు తగ్గించాలని తాను కోరుకుంటున్నానని, అయితే భారతదేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. కొన్నిసార్లు ఆర్థిక మంత్రిగా మన పన్నులు ఎందుకు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతకంటే తక్కువకు ఎందుకు వెళ్లలేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. దాదాపు సున్నాకు తీసుకురావాలని అనుకుంటున్నానని, కానీ భారత్ సవాళ్లు తీవ్రంగా ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందన్నారు నిర్మలా.