జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ మహిళా పూనకంతో భవిష్యవాణి వినిపించడం కలకలం సృష్టిస్తుంది. గురుకులంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. నలుగురు అస్వస్థత గురి కావడం సర్వత్ర ఆందోళన జరుగుతోంది. ఈ క్రమంలోనే మహిళ పూనకం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించి పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. ఓ విద్యార్థి తల్లి కృష్ణవేణి పూనకాలతో ఊగిపోతూ తన మాయే ఈ దుస్థితికి కారణమని చెప్పడం అందరిని ఆలోచనలో పడేసింది. నాగేంద్రుడి రూపంలో తన మాయ చూపినా లెక్క చేయడం లేదని మహిళ పూనకంతో భవిష్యవాణి వినిపించారు‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here