గత వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 117 తెచ్చింది. దీన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 117ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు‌. తీరా ఇప్పుడు అదే జీవో ఆధారంగా ఉపాధ్యాయులు మిగిలిపోయారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. అందులో స్కూల్ అసిస్టెంట్లు 8,773 మంది, ఎస్జీటీలు 20,469 మంది, ఎయిడెడ్ లో 750 మంది ఉన్నారు. జిల్లాల వారీగా ఒక్క అనంతపురంలోనే 1,023 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 771 మంది ఎక్కువయ్యారని ప్రభుత్వం చెబుతోంది.‌ ఈ జీవో 117తో 12 వేల ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్‌ ఉన్నారు.‌ ఇప్పుడు కూడా అదే జీవో ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల మరో 4-5 వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌గా మిగులుతాయని అంచనా. ఇంత భారీ సంఖ్యలో టీచర్లు మిగులు ఉంటే కొత్త వారి సంగతి ఏమిటీ? తొలి సంతకాల డీఎస్సీ ఏమవుతుంది? అనే అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here