అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యకు సంబంధించిన మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రదానం చేస్తారు. ఆర్థిక భారం లేకుండా చదువును కొనసాగించడానికి అవకాశం కల్పిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్లలో ప్రతిభావంతులైన 100 విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 6 లక్షలుగా స్కాలర్షిప్ నిర్ణయించారు. ఇప్పటి వరకు రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్షిప్లను అందించింది.