సీతాారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ కావటంతో ఇవాళ కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పైలాన్ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా పాల్గొన్నారు.