ప్రస్తుతం ఉదయం 8 తర్వాత మరో సర్వీసు లేక పోవడంతో పగటి పూట మరో విమానాన్ని ఢిల్లీకి నడపాలని ప్రయాణికులు, వ్యాపార వర్గాల నుంచి డిమాండ్ ఉంది. విజయవాడ నుంచి కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకరించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో గురువారం పోస్టు చేశారు. ‘ ‘విజయవాడలో ఉదయం 11. 10 గంటలకు విమానం బయలుదేరుతుందని, మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీ చేరుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి.. విజయవాడకు 10.40 గంటలకు చేరుకుం టుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే విమాన సర్వీసు వల్ల రాజధాని అమరావతి, దిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి” అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here