రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి..
ఆసుపత్రుల్లో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని.. ఐఎంఏ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు, కార్యదర్శి డీఆర్ ఫణిధర్, కోశాధికారి డీఆర్ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.