1.83 కోట్ల మంది అప్డేట్ చేసుకోవాల్సిందే
ఏపీలో ఇంకా 1.83 కోట్ల మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని ఉడాయ్ తెలిపింది. చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు, బయోమెట్రిక్ తో ఫొటో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసు దాటిన వారి తమ వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉందని ఉడాయ్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సిన వారు 48,63,137 మంది ఉన్నారని తెలిపింది. గతంలో ఆధార్ పొందిన పదేళ్లలో ఒకసారైనా ఆధార్ లోని అడ్రస్తో పాటు ఫొటో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేటగిరిలో 1,35,07,583 మంది అప్డేట్ చేసుకోవాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.