దువ్వాడ శ్రీనివాస్ వివాదం

దువ్వాడ శ్రీనివాస్‌, వాణి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇరువర్గాల బంధువులు రంగంలోకి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు దువ్వాడ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన భార్య భార్య దువ్వాడ వాణి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. తనకు రాజకీయాలు, ఆస్తులు వద్దని తన భర్త తనకు కావాలంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌, తన పిల్లలు, తానూ అందరం కలిసి ఉండడమే తనకు కావాలన్నారు. తనతో కలిసి ఉండేందుకు భర్త ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తానని వాణి చెప్పారు. తన భర్త ఎలా తిరిగినా తనకు సంబంధం లేదని, తమతో మాత్రం కలిసి ఉండాలని కోరారు. కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here