రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023- 24 ఆర్థిక సంవత్సరానికి దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.మండల స్థాయి కమిటీ నుంచి 1:3 లో పంపిన లబ్ధిదారులకు ఈరోజు జిల్లాస్థాయి ఎంపిక కమిటీ గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ అధ్యక్షతన, శ్రీ పి.లక్ష్మీరాజం, మెంబర్ కన్వీనర్ ఆధ్వర్యంలో డిఆర్డిఏ శేషాద్రి , మెప్మా పిడి శ్రీ రాజేశం, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ డి.స్వప్న సభ్యులుగా నిర్వహించడం జరిగింది.

 Interviews For Selection Of Beneficiaries For Financial Assistance Rehabilitatio-TeluguStop.com

మొత్తం 32 మంది లబ్ధిదారులకు గాను 28 మంది హాజరయ్యారు.ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు ఇద్దరు ఫోన్ ద్వారా సమాచారం అందించారు, వారిలో ఒకరు లోన్ ఇంట్రెస్ట్ లేదని తెలియజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో అడిషనల్ కలెక్టర్ చర్చించి వారికి ఉన్న విద్యార్హతలు, అనుభవము, ధృవీకరణ పత్రాలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.త్వరలోనే ఎంపికైన వారి జాబితా ను ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here