నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో సోమవారం పండుగ పూట విషాదం నెలకొంది.పోలీసులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన పోతురాజు తేజశ్రీ (14),మేములపల్లి మండలం బుగ్గబావిగూడెంలో తన మేనమామ కోదాటి పరశురాములు పెళ్లికి ఈనెల 18న తల్లిదండ్రులతో కలిసి వచ్చింది.

 Girl Drowned In The Left Canal Tragedy Of Marriage House, Girl Drowned , Left Ca-TeluguStop.com

సోమవారం మధ్యాహ్న సమయంలో తల్లి విజయలక్ష్మితో పాటు మరికొందరి బంధువులతో కలిసి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.

కాలువలోకి దిగిన తేజశ్రీ కాలుజారి ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.

అక్కడ ఉన్న బంధువులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.దీంతో అప్పటి వరకు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులతో కళకళలాడిన పెండ్లి ఇంట్లో పండుగ పూట తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here