గాన కోకిల పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చెన్నయ్‌ మైలాపూర్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు సుశీల. విషయం తెలుసుకున్న అభిమానులు ఎంతో ఆందోలన చెందుతున్నారు. సుశీల ఆర్యోగం గురించి వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు. రెండు రోజులపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో ఉన్న తర్వాత డిశ్చార్జ్‌ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. 

ఆదివారం సుశీలకు హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 86 ఏళ్ళ పి.సుశీల వయోభారం వల్ల వస్తున్న సమస్యల వల్ల కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేపథ్య గాయనిగా ఎంతో మంది యువ గాయనీగాయకులకు పి.సుశీల ఆదర్శం. ఆమెలా శ్రావ్యంగా పాటలు పాడాలని ప్రతి ఒక్క సింగర్‌ కోరుకుంటారు. 9 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన పి.సుశీలకు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులు ఉన్నారు. వయో భారం కారణంగా కొన్ని సంవత్సరాలు ఆమె పాటలు పాడడం లేదు. తమ అభిమాన గాయని త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు సోషల్‌ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here