విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(ntr)గారి రెండవ తరం నట వారసుడు, నందమూరి బాలకృష్ణ(balakrishna)ముద్దుల తనయుడు మోక్షజ్ఞ(mokshagna)సినీ ఎంట్రీ ఖాయమైన విషయం అందరి తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు మూవీ అప్ డేట్స్ కోసం నిత్యం సోషల్ మీడియాని చెక్ చేస్తూనే ఉన్నారు.ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇంకో బడా హీరో వారసుడు ఎంట్రీ కావడంతో సినీ అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు మూవీ రేంజ్ ని చాటి చెప్తుంది.
మోక్షజ్ఞ ని తెలుగు సీమకి పరిచయం చేసే అదృష్టాన్ని ప్రశాంత్ వర్మ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ అవకాశం కోసం ఎంతో మంది దర్శకులు ప్రయత్నించినా కూడా బాలయ్య మాత్రం ప్రశాంత్ వైపే మొగ్గు చూపాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా నిలుపుకొని, బాలయ్య, నందమూరి అభిమానుల రుణం తీర్చువాలని, మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోను ప్రశాంత్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు నిదర్శనంగా కథ లోని ఒక కీలకమైన క్యారక్టర్ కి బాలీవుడ్ సీనియర్ హీరోని తీసుకోవాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే మోక్షజ్ఞ కి గురువు పాత్రలో సదరు హీరో క్యారక్టర్ ఉండబోతుందని, ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులని మెస్మరైజే చేస్తుందని కూడా అంటున్నారు.ఇప్పుడు ఈ న్యూస్ నందమూరి అభిమానుల్లో నయా జోష్ ని తీసుకొస్తుంది. ఏ హీరో అయి ఉండవచ్చనే ఆరా కూడా తీస్తున్నారు.
ఇప్పటికే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా చెయ్యబోతున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో మూవీ ఉండబోతోందనే టాక్ కూడా వస్తుంది. ఏది ఏమైనా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ మీద ల్యాండ్ అయ్యే వరకు డెబ్యూ మూవీ అప్ డేట్స్ వరుస సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం ఖాయం.