Tadipatri Tension : అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి. ఇటీవల కాస్త సైలెంట్ అయిన తాడిపత్రి… మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. మంగళవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రికి వచ్చారు. పెద్దారెడ్డి తాడిపత్రికి రాగానే వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమను కవ్వించారని టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేత రఫీపై దాడి చేశారు. ఈ ఘర్షణలో వైసీపీ నేత మురళీ ప్రసాద్ రెడ్డి గన్ తో హల్చల్ చేశారు. గన్ బయటికి తీసిన కాల్చి పడేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
Home Andhra Pradesh భగ్గుమన్న తాడిపత్రి-పెద్దారెడ్డి రాకతో హైటెన్షన్, వైసీపీ నేత ఇంటిపై దాడి-tadipatri high tension ysrcp ex...