కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం జరిగింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే కర్రతో కొట్టి హతమార్చాడు కుమారుడు. దుర్కి గ్రామంలో సాయిలు, అంజవ్వ దంపతులు ఉండేవారు. వారికి కూతురు సోని, కుమారుడు సాయికుమార్ ఉన్నారు. సోనికి కొన్నాళ్ల కిందట పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. కుమారుడు సాయికుమార్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు.