పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మి కోసం మొత్తం 65,026 దరఖాస్తులు చేసుకోగా ఈ సంవత్సరం 2024-25కి గాను ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి 2024 వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మార్వో వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా .. ఆర్డీవో వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here