భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. గత కొంతకాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న 38 ఏళ్ల ధావన్ ఇంటర్నేషనల్ క్రికెెట్కి దూరమవుతున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. శిఖర్ ధావన్ చివరిసారిగా 2022, డిసెంబరులో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో భారత్ తరఫున ఆడాడు.
సుదీర్ఘ కెరీర్లో ధావన్ 269 మ్యాచ్లాడి 24 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా వన్డేల్లో భారత బ్యాటింగ్ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తూ అన్ని ఫార్మాట్లలో కలిపి 10,867 పరుగులు చేశాడు.