గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, సునీల్, సుమద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాట త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు ఆఖరులో దీనిపై అప్‍డేట్ వస్తుందని ఇటీవలే థమన్ హింట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here