18 కిమీల అండర్ గ్రౌండ్ టన్నెల్

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఉద్దేశించిన రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కర్ణాటక మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. మొదటిది రూ.12,690 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బెంగళూరులో హెబ్బాళ్ ఫ్లైఓవర్ నుండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు, 18 కిలోమీటర్ల మేర, భూగర్భంలో ట్విన్-ట్యూబ్ టన్నెల్ ను నిర్మిస్తారు. ఈ 18 కిమీల మార్గంలో ఐదు ఎంట్రీ, ఐదు ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు కర్నాటక ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు జారీ చేస్తామని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ధృవీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here