రూటు మార్చిన మోసగాళ్లు..
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అగంతుకుల ఫోన్ కాల్స్ కు, గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలు, ఫోన్ లకు వచ్చే మెసేజ్ లకు, లింక్ లకు స్పందించవద్దని కోరుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.