గతంలో నామమాత్రంగా..

గతంలో అక్రమ కట్టడాలు ఉంటే.. బల్దియా, హెచ్‌ఎండీఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు చేయడంతో సరిపుచ్చేవారు. బల్దియా పరిధిలో ఆక్రమణల తొలగింపు, ఇతరాల కోసం గత ప్రభుత్వ హయాంలో 500 మందితో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఈవీడీఎంఏ)ని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను ఐపీఎస్‌ అధికారికి అప్పగించారు. ఈ సంస్థ అక్రమాలకు ఆలవాలంగా మారిందన్న ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం ఈవీడీఎంఏను కూడా హైడ్రాలో విలీనం చేశారు. ఇప్పటి హైడ్రా మాత్రం మొత్తం భవనాలను నేలమట్టం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here