అనంతరం అమెరికా చేరుకుని వైద్యడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం అంతా అమెరికాలోనే స్థిరపడ్డారు. రమేష్ బాబు కరోనా సమయంలో విశేష సేవలందించారు. అందుకు గాను పురస్కారాలు కూడా అందుకున్నారు. తాను చదువుకున్న మేనకూరు ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం ఇచ్చారు. అంతటి సేవా తత్పరుడుగా రమేస్ బాబు పేరు పొందాడు.