నేచురల్ స్టార్ నాని(natural star nani), ఎస్.జె.సూర్య(sj surya), ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ గత వారం రోజులుగా జరుగుతున్నాయి. వచ్చే గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శనివారం నాని కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళారు. నాని, అంజన, కుమారుడు అర్జున్తోపాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియాంక మోహన్(priyanka mohan) కూడా వారి వెంట వెళ్ళారు. అందరూ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.
కాలినడక మార్గంలో ఫేస్ మాస్క్తో వెళుతున్న నానిని అందరూ గుర్తు పట్టి దగ్గరికి వచ్చి పలకరించారు. అందరితోనూ మాట్లాడిన నాని ఎంతో ఓపికగా వారందరితో విడివిడిగా ఫోటోలు దిగారు. నానితో అభిమానులు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాని సినిమాల విషయానికి వస్తే ఆమధ్య వచ్చిన హాయ్ నాన్న మంచి విజయాన్ని సాధించింది. లేటెస్ట్గా వస్తున్న సరిపోదా శనివారం(saripoda sanivaram)పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాని కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా సరిపోదా శనివారం నిలిచింది. ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు బడ్జెట్ పెట్టారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఇంతకుముందు అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. అయితే అది ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సరిపోదా శనివారం మాత్రం డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు నాని, వివేక్ ఆత్రేయ.