70 శాతం కనుమరుగు..
కరీంనగర్ సమీపంలోని గ్రామాల్లో నూటికి 70 శాతం చెరువులు కుంటలు మాయమైపోయాయి. బొమ్మకల్, తీగలగుట్టపల్లి, ఆరపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, చింతకుంట, అలుగునూరు గ్రామాలు భూమాఫియాకు అడ్డాగా మారాయి. ముఖ్యంగా బొమ్మకల్ గ్రామ పరిధిలో 46.21 ఎకరాల్లో ఉన్న జక్కప్ప చెరువు, 28.10 ఎకరాల్లో ఉన్న గోపాల్ చెరువు, 16.10 ఎకరాల్లో ఉన్న నల్లచెరువు, 12 ఎకరాల్లో ఉన్న గోధుమకుంట, 9.10 ఎకరాల్లో ఉన్న రావికుంట కబ్జాకు గురయ్యాయి.