Nalgonda Farmers: బత్తాయి సాగులో దేశ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్ధాల కింద జిల్లాలో బత్తాయి సాగు మొదలైన రోజుల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో తోటలు ఉంటే.. ఇపుడా విస్తీర్ణం 40వేల ఎకరాలకు తగ్గిపోయింది. నాసిరకం మొక్కలు, సరైన దిగుబడి రాకపోవడం, దిగుబడికి కనీస గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ మద్దతు అంతంతమాత్రంగానే ఉండడం, స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, దళారులు చెప్పిందే వేదం కావడం, మార్కెట్ లో రైతులు నిలువు దోపిడీకి గురికావడం వంటి కారణాలతో జిల్లాలో బత్తా తోటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here