ప్రతి నిత్యం కొన్ని వందల ఆవులు, పశువులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రా లకు యధేచ్ఛగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్ష చట్టం ప్రకారం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పశువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆవులను పశువులను కాపాడాలని కోరారు. అన్ని జిల్లాల పోలీసు అధికారులు గోరక్షణకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గోవూలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు.